amp pages | Sakshi

టీడీపీ అలా చేసుంటే.. బోటు ప్రమాదం జరిగేదా?

Published on Thu, 10/10/2019 - 16:35

సాక్షి, కాకినాడ : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. బోటు ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందని.. అందులో ప్రభుత్వ వైఫల్యం లేదని తెలిపారు. బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించిందని తెలిపారు. బోటు ప్రమాదం నుంచి పలువురు పర్యాటకులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సహకాలు అందజేస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదాలు జరిగనప్పుడే.. నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. 

గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు కనీసం ఆ కుటుంబాలకు సంతాపం కూడా తెలుపలేదని విమర్శించారు. తొక్కిసలాటకు కారకులైన వారిపైన చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు బోటు ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే చేయడాన్ని తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ఉన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయకపోతే.. నీటిపై నడిచి వెళ్తారా టీడీపీ నాయకులను ప్రశ్నించారు. 250-300 అడుగుల లోతున ఉన్న బోటును బయటకు తీయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. బోటును తీయగలం అని ఎవరైనా ముందుకు వస్తే.. అందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)