ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్లో పాలన గతి తప్పింది: కేవీపీ
Published on Wed, 04/18/2018 - 09:29
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పాలన గతి తప్పిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో నగదు కొరత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.
పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు..సమస్యల పరిష్కార కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పంచాయతీ స్థాయి నుంచి సీఎం పేషీ వరకు అవినీతి తాండవిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల్ని విస్మరించి రాజకీయ, అధికారిక సమావేశాలు, సమీక్షలకే చంద్రబాబు పరిమితం కావడం సరికాదన్నారు.
#
Tags