amp pages | Sakshi

స్పీకర్‌ కీలక నిర్ణయం: కమల్‌ రాజీనామా..!

Published on Fri, 03/20/2020 - 08:36

భోపాల్‌ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాపై పెద్ద చర్చ జరుగుతుండగా... మధ్యప్రదేశ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో ఇబ్బందుల్లో పడ్డ కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు (శుక్రవారం) కఠిన పరీక్షను ఎదుర్కొనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో స్పీకర్‌ ఎస్‌పీ ప్రజాపతి నేడు బలపరీక్షను చేపట్టనున్నారు. గత నెల రోజులుగా సాగుతున్న ఈ తతంగానికి ముగింపు పలకే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. (నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష)

రాజీనామాల ఆమోదం..
ఈ నేపథ్యంలోనే గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం గెలుపొందడం అంతతేలిక కాదు. (బలపరీక్షపై వైఖరేంటి?)

కమల్‌నాథ్‌ రాజీనామా..?
ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతు లేకపోవడంతో.. బలపరీక్ష వరకూ వెళ్లి భంగపడటం కన్నా ముందే రాజీనామా చేయడం సబబు అని ప్రభుత్వ వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పీకర్‌ ప్రజాపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం మధ్యాహ్నాం కమల్‌నాథ్‌ మీడియా సమావేశం  ఏర్పాటు చేసి.. కీలక ప్రకటన చేస్తారని అన్నారు. దీంతో రాజీనామా చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం మంతనాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌