amp pages | Sakshi

సోనియాతో మరోసారి పవార్‌ భేటీ?

Published on Mon, 11/11/2019 - 10:03

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తాత్కాలిక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మరోసారి న్యూఢిల్లీలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ కానున్నారు. భేటీకి ముందు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరితో చర్చించేందుకు శరద్‌ పవార్‌ మంగళవారం ముంబైకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా నెలకొన్న ప్రతిష్టంభనపై తదుపరి ఎలాంటి వ్యూహరచన చేయాలనే దానిపై చర్చినున్నారు. ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుని సోనియాతో భేటీ అయ్యేందుకు పవార్‌ ఢిల్లీకి బయలుదేరనున్నారు.  

ఇప్పటికే పలువురు సమావేశం..
రాష్ట్రంలో అక్టోబరు 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 24వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. కాని ఫలితాలు వెలువడి 18 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అంతేగాకుండా శాసన సభ గడువు శనివారం సాయంత్రంతో ముగియడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సమయంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారనుంది. 105 మంది ఎమ్మెల్యేలను గెలుపించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన  బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ త్వరలో సోనియా గాంధీతో భేటీ, తమ పార్టీ ఎమ్మెల్యేలందరిని మంగళవారం సమావేశానికి ఆహ్వానించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు తమ తమ పార్టీ ఎమ్మెల్యేలపై డేగ కన్ను వేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు లాక్కునే ప్రయత్నం చేసే ప్రమాదముంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. శివసేన ముంబైలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భద్రంగా దాచింది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై సోనియా నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్పీఐ చీఫ్‌ రాందాస్‌ ఆఠావలే, శివసేన ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రావుత్‌ ఇలా వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు శదర్‌ పవార్‌తో భేటీ అయ్యారు. మరికొందరు భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ దిగ్గజం, ఒక సీనియర్‌ నేతగా ఆయన్నుంచి సలహాలు తీసుకుంటున్నారు. దీంతో పవార్‌ నివాసం ప్రముఖుల రాకపోకలతో సందడిగా కనిపిస్తోంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)