amp pages | Sakshi

చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్‌..

Published on Fri, 03/06/2020 - 18:09

సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అందుకే ఎన్నికలు ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆయనమండిపడ్డారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు గురుంచి ఇన్నాళ్లు మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల  సమయంలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలు జరిపాలని చూస్తుంటే, స్టేల కోసం టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కోల్పోయారన్నారు. (‘బీసీల పట్ల ప్రేమ అంటూనే కోర్టుకు వెళ్తారా..’)

అధికారంలో ఉండగా చంద్రబాబు బీసీలకు చేసిందేమి లేదని, గడిచిన ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కనుచూపు మేరలో కూడా కనిపించదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే లోకేష్ ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతున్నారని, అధికారం కోల్పోయారని తండ్రి కొడుకు కడుపు మంటతో  ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు 90 శాతం అమలు చేశామని తెలిపారు. (టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి: మంత్రి బొత్స)

‘‘బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చిదాం. మీరు సిద్దమేనా...? గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మతాల ప్రస్తావనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్‌ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టారు. ఒక్కరోజులోనే 95 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత మాది. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. విద్య, వైద్య రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చూస్తున్నారు. బోండా ఉమా నిరాశలో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. విడతల వారిగా మద్యం నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే మీ అయిదు సంవత్సరాల పాలనపై, మా తొమ్మిది నెలల పాలపై చర్చకు సిద్దమా...?’’ అంటూ చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్‌ విసిరారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)