amp pages | Sakshi

రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేదు

Published on Tue, 10/23/2018 - 01:44

హైదరాబాద్‌: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేదని కొన్ని మీడియా సంస్థలు పాలించేవారికి సొత్తులుగా మారుతున్నాయని, అధికారంలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బండ్లగూడలో గిరిప్రసాద్‌ భవన్‌లో నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ప్రజాపక్షం అనే తెలుగు పత్రిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ్‌ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ, కేసీఆర్‌ ప్రజాస్వామ్య విలువలను అణచివేసే ప్రక్రియను బహిరంగంగానే చేపట్టారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలుస్తే ప్రజాస్వామ్యం బతకదని, తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలు ఇతర రంగాలను శాసించినట్లే మీడియాను కూడా శాసిస్తున్నాయని అన్నారు. మీడియాను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. నాలుగేళ్లకే పాలన పగ్గాలు పడేసి మళ్లీ ఓటు కోసం వస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు అడ్డుకుంటున్నారని తెలిపారు.

పత్రికా స్వేచ్ఛను కేసీఆర్‌ ప్రభుత్వం హరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. అన్ని పక్షాలు ఏకమై టీఆర్‌ఎస్‌ పార్టీని ఇంటికి పంపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి  పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం ఎడిటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ జాయింట్‌ సెక్రటరీ దేవులపల్లి అమర్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్‌పాషా, మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వర్‌రావు, గుండా మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)