amp pages | Sakshi

నిప్పో స్థలం పరాధీనాన్ని అడ్డుకుంటా!

Published on Fri, 04/06/2018 - 12:40

నెల్లూరు(సెంట్రల్‌): నగరంలోని అ త్యంత విలువైన నిప్పో స్థలాన్ని పరాధీనాన్ని అడ్డుకుని తీరుతానని నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తానని గతంలో చెప్పి మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ఆ స్థలంపై విచారణ చేస్తున్నామని ఎందుకు మాట మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆర్డీఓ, తహసీల్దార్‌ లిఖి త పూర్వకంగా ఇచ్చిన నిబంధనల ప్ర కారం నిప్పో ఫ్యాక్టరీని యజమానులు నడప లేకపోతే ఎటువంటి నష్ట పరి హారం చెల్లించకుండా ప్రభుత్వం స్వా« దీనం చేసుకోవచ్చుని స్పష్టంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు అధికారికంగా ఇచ్చిన వా టిపై విచారణ జరపాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటని మంత్రిని ప్రశ్నిం చారు. ప్రధానంగా ఉత్తరాంధ ప్రాం తానికి చెందిన మం త్రికి నిప్పో స్థలా న్ని ధారాదత్తం చేయాలని జిల్లాకు చెందిన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మంత్రి నా రాయణ, మేయర్‌ అజీజ్‌ నిప్పో స్థలా న్ని తక్షణమే స్వాధీనం చేసుకుని, ప్రజాప్రయోజనాలకు విని యోగించాలన్నారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు, గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లో మంత్రి, మేయర్‌ ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా తీర్మానం పెడితే అందరం సహకరిస్తామన్నారు.

కాగితాలు కాల్చేశామని చెప్పడం ఏమిటి?
నిప్పో స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సమాచార చట్టం ద్వారా కలెక్టర్‌ కార్యాలయానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేశానని, అయితే రెండు నెలల తర్వాత నిప్పో ఫ్యాక్టరీకి సంబంధించి అన్ని ఫైల్స్‌ను కాల్చేశామని (డీ డిస్పోజల్‌) అని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌ కార్యాలయం నుంచి తనకు ఇచ్చారని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. అనంతరం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నానని, ఆర్డీఓ  నుంచి 150 పేజీల వివరాలు పంపారన్నారు. అందులో 9,10 నిబంధనల్లో స్పష్టంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఉందన్నారు.  కలెక్టర్‌ కార్యాలయం కాల్చేశామని చెప్పడం,  ఆర్డీఓ కార్యాలయం అధి కా రులు పత్రాలు ఇవ్వడం చూస్తే కలెక్టరేట్‌ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

పోరాటాలతో సాధించాం
గతంలో రూ.కోట్ల విలువ చేసే కస్తూరిదేవి స్కూల్‌ స్థలాన్ని కొందరు కాజేయాలని చూస్తే పోరాటం చేసి అడ్డుకున్నానన్నారు. నెల్లూరురూరల్‌ పరిధి లోని జాతీయ రహదారి వద్ద టోల్‌ గేట్‌ ఏర్పాటు చేస్తామంటే పో రాటం చేసి అడ్డుకున్నామని గుర్తు చే శారు. అదే విధంగా ఇస్కాన్‌ సిటీ ప్రాంతంలో రూ.వంద కోట్ల విలువ చేసే పా ర్కు స్థలాన్ని కాజేయాని చూస్తే అడ్డుకున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. నిప్పో ఫ్యాక్టరీ స్థలం ప్రైవేటు పరం చేసే ఊరుకోమని హెచ్చరించారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)