amp pages | Sakshi

‘నిరాశ-నిస్పృహలకు చోటే లేకుండా పోయింది’

Published on Sun, 02/11/2018 - 12:53

అబుదాబి : భారత్‌లో నిరాశ, నిస్పృహలకు చోటు లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల్లో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నార్థకం పోయి.. పని ఎప్పుడు పూర్తవుతుందనే విశ్వాసం ఏర్పడిందని ఆయన తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం దుబాయ్‌ ఓపెరా హౌజ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు.

‘ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన సుమారు 30 లక్షల మందికి యూఏఈ సొంత దేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషంగా ఉంది. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచస్థాయిలో భారత్‌ గౌరవం పరిఢవిల్లుతోంది. యూఏఈ ప్రగతి పథంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషం. భారత అభివృద్ధిలోనూ మీరూ(ప్రవాస భారతీయులను ఉద్దేశించి) భాగస్వాములు కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇక ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ సల్మాన్‌ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఇది భారత సంస్కృతికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసంగానికి ముందు ఆయన అబుదాబిలో తొలి హిందూ దేవాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి 2వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

ఇక ఉదయం అబుదాబి లోని అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.  యూఏఈ పర్యటనలో భాగంగా దేశ పాలకుడు, ప్రధానిలతోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇప్పటికే భారత్ - యూఏఈ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగం, రైల్వేలు, మానవ వనరులు, ఆర్థిక సేవలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్‌ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?