amp pages | Sakshi

అలాగైతే ప్రలోభాలకు గురిచేస్తారు: ఉత్తమ్‌

Published on Fri, 05/17/2019 - 17:49

హైదరాబాద్‌: జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్‌ల ఎంపిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, జనసమితి, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ఈసీని కలిసిన అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్‌ ఎంపికకు 40 రోజుల గడువు పెడితే అధికార పార్టీ ప్రలోభాలకు  గురిచేస్తుందని, అలా చేయవద్దని కోరినట్లు చెప్పారు.

ఫలితాలు వచ్చిన 3 రోజుల్లో చైర్మన్‌ల ఎంపిక జరిగేటట్లు చూడాలని కోరామన్నారు. బ్లాక్‌ మనీ, పోలీసులను ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను అప్రజాస్వామిక పద్ధతిలో ఇదివరకే చేర్చుకున్నారని ఆరోపించారు. మే 27న కౌంటింగ్‌ చేసి 3 రోజుల్లో చైర్మన్‌ల ఎంపిక చేసి జూలై5 తర్వాత ఛార్జ్‌ తీసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వెల్లడించారు. 

చట్టాలంటే కేసీఆర్‌కు గౌరవం లేదు: ఎల్‌ రమణ(టీటీడీపీ అధ్యక్షులు)
చట్టాల పట్ల కేసీఆర్‌కు గౌరవం లేదని టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌ రమణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, చైర్మన్‌ల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఫలితాల తర్వాత చైర్మన్‌ల ఎంపికకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల 538 ఎంపీపీలు, 28 జెడ్పీ చైర్మన్‌లు టీఆర్‌ఎస్సే గెలిచే అవకాశం ఉంటుందన్నారు.

ప్రజాస్వామ్యం కూనీ: షబ్బీర్‌ అలీ

కేసీఆర్‌ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తున్నారని మాజీ మంత్రి , కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తిగా కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?