amp pages | Sakshi

‘ఆర్మీ తెగువను మోదీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’

Published on Wed, 02/27/2019 - 11:15

సాక్షి, ఏలూరు: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేయడం గర్వకారణమని కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఒక విధానంగా పాకిస్థాన్‌ మలుచుకుందని, పాక్‌లోనే కాదు.. మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్‌ దాడులు చేయాలని ఆయన సూచించారు. భారత ప్రతీకార చర్యకు ప్రస్తుతం అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని,  అయితే, ఇది వెంటనే సంతోషించాల్సిన విషయం కాదన్నారు. పాకిస్థాన్‌కు యుద్ధం చేసి గెలిచే అవకాశం లేనందున ఆ దేశం ఉగ్రవాద దాడులు చేసేందుకు తెగబడే ప్రమాదం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండడంతోపాటు అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని సూచించారు.

సర్జికల్ స్ట్రైక్ లు మోదీ చేసినవి కావు...
‘ఈ సర్జికల్ స్ట్రైక్ లు మోదీ చేసినవి కావు. అంతకుముందు జరిగాయి. ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. భారత్ ఆర్మీ తెగువను ప్రచారం కోసం మోదీ వాడుకుంటున్నారు. కశ్మీర్ ప్రజల మద్దతు పోగొట్టుకోవడమే మోదీ ప్రభుత్వం వైఫల్యం. అందుకే పుల్వామా, ఇతర ఉగ్ర దాడులు మితిమీరాయి’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక భారత ప్రభుత్వానికి కశ్మీర్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ ప్రధాన అంశాన్ని భారత ప్రభుత్వం గుర్తించి, కశ్మీరీల మద్దతు సంపాదించాలని పేర్కొన్నారు. మోదీ అనేక అంశాల్లో విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా మోదీ సర్కారు ఎదుర్కోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌