amp pages | Sakshi

రాజ్యసభ సీటు ఇస్తానని బాబు మోసం చేశారు

Published on Mon, 07/23/2018 - 02:35

సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ పెట్టి చంద్రబాబు తనను మోసం చేశారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. గత ఎన్నికలకు ముందే తాను 2012లోనే రాజకీయాలపై మాట్లాడేందుకు చంద్రబాబును కలిసినట్టు చెప్పారు. అప్పుడే రాజకీయ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 60–70 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయనకు చెప్పానన్నారు.

మీరు పార్టీపెట్టి విడిగా పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయని, ఆ ఆలోచన చేయవద్దని చంద్రబాబు అప్పట్లో తనకు సూచించారన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చెప్పారని, మరుసటి రోజు అదే విషయాన్ని రెండు పత్రికల్లో రాయించారని తప్పుపట్టారు. అప్పడే చంద్రబాబుపైన, టీడీపీపైన నమ్మకం పోయిందన్నారు. ఆ పార్టీకి దండం పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్రమోదీని కలిసినట్టు చెప్పారు. అప్పట్లో తాను 60–70 సీట్లలో పోటీచేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం తనకు ఉండేదన్నారు. 

లోకేశ్‌ సీఎం అయితే రాష్ట్రం ఏమవుద్దో
రాష్ట్రంలో వేలాది ఎకరాల భూసేకరణ జరుగుతుందిగాని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మాత్రం లేనేలేదన్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ ఒక్కరికే ఉద్యోగం వస్తే సరిపోద్దా.. రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. భవిష్యత్‌లో లోకేష్‌ సీఎం అయినా తనకేమీ అభ్యంతరం లేదు కానీ, ఆయన సీఎం అయితే మాత్రం రాష్ట్రం ఏమవుతుందో అనేదే తన భయమన్నారు. లోకేష్‌ సీఎం అయితే రాష్ట్రంలో భూముల పరిస్థితి ఏమిటోనని భయపడుతున్నానని చెప్పారు. తనను అనుభవం లేని రాజకీయ నాయకుడిని అంటున్నారని.. తనను విమర్శించే వారు రాజకీయ అనుభవంతోనే పుట్టారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కిందపడతాం, పైన ఎక్కుతాం, ఆఖరికి జనసేన పార్టీ అధికారం సాధించకుంటుందని చెప్పారు. తనకు కులపిచ్చి ఉందని చంద్రబాబు ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని, కులపిచ్చి అయితే తానెందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని ప్రశ్నించారు.

జగన్‌పై విమర్శకు పార్టీ కార్యకర్తల నుంచే రిటార్ట్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌కల్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో తాము పోటీచేసి కొంత మంది ఎమ్మెల్యేలం గెలిచి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిలా అసెంబ్లీని వదిలి పారిపోయేవాళ్లం కాదని పవన్‌కల్యాణ్‌  అన్నారు. అసెంబ్లీలో నిలదేసే వాడినని అన్నారు. ఆయన మాటలకు ఆ పార్టీ కార్యకర్తలే అడ్డుతగిలారు. పలువురు కార్యకర్తలు ఒక్కసారిగా పెద్దపెట్టుగా ‘ఆయనను అక్కడ మాట్లాడనీయలేదుగా’ అంటూ అరిచారు. దీనికి స్పందించిన పవన్‌కల్యాణ్‌  ‘అయినా మాట్లాడాలి’ అని బదులిచ్చారు. తనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే (కాని పవన్‌ ఎంపీలు అని వ్యాఖ్యానించారు) అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేవాడనన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నారని వ్యాఖ్యానించారు.

బలవంతపు భూసేకరణపై పోరాడండి
సాక్షి, అమరావతిబ్యూరో/మంగళగిరిటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం తన భూదాహాన్ని తగ్గించుకోవాలని.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, వారి కన్నీళ్లను చూడాలనుకుంటే ఎంతటి వారైనా సర్వనాశనమవుతారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకుని కొద్దిమందికే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణను విరమించుకుని ప్రజా మద్దతుతో రాజధానిని నిర్మించాలని ఆయన హితవుపలికారు. అందుకు విరుద్ధంగా అన్నదాతలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే తిరగబడాలని రైతులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పంట పొలాల్లో ఆదివారం ఆయన రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం రైతులతో సమావేశమై వారి బాధలను తెలుసుకున్నారు. 

భూముల్లోకి వెళ్లేందుకు ఆంక్షలు..
రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లోకి వెళ్లేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నారని, సబ్సిడీలను అడ్డుకుంటున్నారని.. బ్యాంకుల్లో రుణాలు కూడా మంజూరు చేయనీయడం లేదని వాపోయారు. 120 రకాల పంటలు పండే ఈ ప్రాంతంలోని సారవంతమైన భూములను మెట్ట భూములు, వర్షాధారిత భూములని ప్రభుత్వం సాకుగా చెప్పడం అన్యాయమన్నారు. రైతుల నుంచి ఇష్టపూర్వకంగా భూములు తీసుకుంటానంటే రాజధాని నిర్మాణానికి తాను మద్దతిచ్చానని.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రైతుల కష్టాలు తెలియని వారు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారని.. మంత్రి నారాయణ దగ్గరుండి పచ్చటి పొలాలను దున్నించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి మరో 25 ఏళ్లు పట్టేలా ఉందని చెప్పారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)