amp pages | Sakshi

తుపాను తీవ్రతను ప్రధాని దృష్టికి తీసుకెళతా

Published on Thu, 10/18/2018 - 03:03

వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పదేళ్లపాటు బాధితులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ లేఖ రాస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునల్తాడ, భావనపాడు, పొల్లాడ, పాతటెక్కలి తదితర గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. సూర్యమణిపురం, పాతటెక్కలి, అమలపాడు ప్రాంతాల్లో తుపాను ధాటికి దెబ్బతిన్న జీడి, కొబ్బరి తోటలను పరిశీలించారు.

అనంతరం అమలపాడు గ్రామంలో తుపాను బాధిత జీడి, కొబ్బరి రైతులనుద్దేశించి మాట్లాడారు. తుపాను కారణంగా ఉద్దానం 30 ఏళ్లపాటు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఉద్దానం ప్రజల జీవితాలే కూలిపోయాయని, వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వెలిబుచ్చారు. సహాయ చర్యలపై తమ పార్టీకి చెందిన బృందాలతో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్రప్రభుత్వం విషయంలో స్పందిస్తానని చెప్పారు. అమలపాడు మాజీ సర్పంచ్‌ దున్న షణ్ముఖరావు మాట్లాడుతూ.. గ్రామంలో వారంతా నిరుపేదలని, కొబ్బరి మొక్కలు వేసి అవి కాపునకు రావాలంటే పదేళ్లు పడుతోందని.. ఈలోగా తాము బతికేదెలా అంటూ వాపోయారు. పవన్‌ స్పందిస్తూ.. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు తాను ఉద్దానం ప్రాంతంలో మూడు రోజులు పర్యటిస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని గట్టిగా అడుగుతానని చెప్పారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)