amp pages | Sakshi

బాబు మాటలకు ఎన్నాళ్లు మోసపోతారు..?

Published on Thu, 03/29/2018 - 11:11

కుప్పం: చంద్రబాబు మోసపూరిత మాటలకు ఇంకా ఎన్నాళ్లు మోసపోతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె మండలాల్లో ఆయన పర్యటించారు. ఆయన పర్యటనకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ఆయా గ్రామాల్లో పార్టీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడక్కడ టీడీపీ నాయకులు ఆటంకాలు కల్పించేందుకు యత్నించినా ఆయన పర్యటన విజయవంతంగా సాగింది. సీఎం ఇలాకాలో పెద్దిరెడ్డి పర్యటన విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. గుడుపల్లె మండలం సోడిగానిపల్లెలో జరిగిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఏళ్ల తరబడి మోసపు మాటలతో కుప్పం ప్రాంతవాసులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గణేష్‌పురం వద్ద పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచి సర్వేలంతా పూర్తి చేసినా, చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మక్కై నిలిపివేశారని ఆరోపించారు.

30 ఏళ్లుగా శాసన సభ్యులుగా కొనసాగుతున్న చంద్రబాబు కుప్పం ప్రాంతానికి శాశ్వత నీటి సదుపాయం కల్పించలేకపోయారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే హంద్రీ–నీవా కాలువలు, పాలారు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం అని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే నిబంధనలు పెట్టి రైతులను మోసం చేయలేదా అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో కూర్చుంటానే గాని ఇలాంటి దొంగ హామీలు ఇవ్వనని జగన్‌మోహన్‌రెడ్డి ఆరోజు రుణమాఫీపై వెనకడుగు వేశారని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ఓట్లకోసం యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధమని రావడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన సోడిగానిపల్లె గ్రామస్తులు
సోడిగానిపల్లెకు చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌ గోవిందతో పాటు కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న టౌన్‌బ్యాంకు వైస్‌ చైర్మన్, విజయవాణి విద్యాసంస్థల అధినేత భాగ్యరాజ్, పీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్, డీకే.పల్లె టీడీపీ యువ నాయకులు చంద్ర పార్టీలో చేరారు. వీరితో పాటు గుండ్లసాగరం గ్రామానికి చెందిన 20 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)