amp pages | Sakshi

మోదీ ఏది చేసినా ఓ లెక్కుంటుంది!

Published on Mon, 05/28/2018 - 19:01

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు అట్టహాసంగా నగరంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కేరింతలు కొడుతూ ఆయనపై పూరేకులు విరజిమ్మారు. ఢిల్లీ–మీరట్‌ మధ్య పూర్తయిన 82 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రారంభించిన మోదీ అదే రహదారిపై 9 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌ ఎక్కి ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌ వెళ్లారు. 

ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభోత్సవం చేయడానికే అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అట్టహాసంగా రిబ్బన్‌ కత్తిరించి ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. తాను లేకపోతే అసలు అభివృద్ధే లేదన్నట్టుగా అక్కడ ఆయన ఫోజిచ్చారు. వాస్తవంగా ఢిల్లీ నగరం గుండా కాకుండా ఢిల్లీ వెలుపలి నుంచి వెళ్లే విధంగా ఓ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాల్సిందిగా 2015లో సుప్రీం కోర్టు అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సంవత్సరం ఈ రోడ్డు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 11 వేల కోట్ల రూపాయలతో 17 నెలల కాలంలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నా విషయంలో సరైన సమయం కోసం మోదీ ఎదురు చూస్తున్నారు. 

గత ఏప్రిల్‌ నెలలోనే ఈ రోడ్డు నిర్మాణం విషయమై సుప్రీం కోర్టు జాతీయ రహదారుల అథారిటీ ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ప్రధాని మోదీకి సమయం చిక్కక పోవడం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించలేక పోయామని అథారిటీ సమాధానం ఇచ్చింది. అధికారిక ప్రారంభోత్సవం జరిగినా, జరక్కపోయినా ఫర్వాలేదు, మే 31వ తేదీలోగా హైవేలోకి వాహనాలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు మే 10వ తేదీన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అయినా మోదీ వీలున్నా వెంటనే స్పందించకుండా ఆదివారం నాడు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను అధికారికంగా ప్రారంభించారు.

దీనికి ఓ లెక్కుంది.మోదీ ప్రారంభోత్సం చేసిన బాఘ్‌పట్‌కు పక్కనే ఉన్న కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం ఉప ఎన్నికలుండడమే ఆ లెక్క. మోదీ దేన్ని ప్రారంభోత్సవం చేసినా అందుకు పక్కా లెక్కలుంటాయనడంలో సందేహం లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ‘రోల్‌ ఆన్‌ రోల్‌ ఆఫ్‌ ఫెర్రీ’ని ప్రారంభించడం కూడా అందులో భాగమే. ఆయన దాన్ని ప్రారంభించి ఆరేళ్లు గడిచాక ఇటీవల వాహనాలను తీసుకెళ్లే ఫెర్రీ ఇప్పుడు వచ్చింది. దానికి రిబ్బన్‌ కత్తిరించేందుకు కూడా మోదీ వెళ్లవచ్చు. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)