amp pages | Sakshi

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

Published on Sat, 12/08/2018 - 02:15

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పోలీస్‌ శాఖ చేపట్టిన భారీ బందోబస్తు, వ్యూహాత్మక ఏర్పాట్లతో చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్‌ పూర్తయింది. మొత్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు.

యాక్షన్‌ టీం కుట్ర భగ్నం
ఖమ్మం జిల్లాలోని చర్లలో ఎన్నికల సిబ్బంది, పోలీస్‌ బలగాలను టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టు యాక్షన్‌ టీం ల్యాండ్‌మైన్లు పేల్చేందుకు కుట్ర పన్నింది. ముందుగానే పసిగట్టిన గ్రేహౌండ్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ బృందాలు వాటిని నిర్వీర్యం చేశాయి. యాక్షన్‌ టీంలోని పలువురు సభ్యులను సైతం పోలీసులు అరెస్ట్‌ చేయడంతో భారీ ముప్పు తప్పిందని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్, చెన్నూర్, భూపాలపల్లి, ములుగు, మంథని, కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు, వైరా, పినపాక, భద్రాచలంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ముగియడంతో భారీ బందోబస్తు నడుమ ఈవీఎం యంత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించారు. 32,500 పోలింగ్‌ స్టేషన్లలో అదనపు బలగాలను రంగంలోకి దించి భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.

రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మంలో చెదురుమదురు ఘటనలు తప్పా మిగిలిన చోట్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 25 వేల మంది, రాష్ట్ర పోలీసులు 50 వేల మంది మొత్తంగా లక్ష మంది వరకు సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, ప్రత్యేక తనిఖీ బృందాలతో సోదాలు, అదేవిధంగా అంతరాష్ట్ర సరిహద్దుల్లో సుమారు 250కి పైగా చెక్‌పోస్టులు, జిల్లాల్లో 515 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సుమారు రూ.125 కోట్ల మేర నగదు, 6 లక్షల లీటర్ల మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల సహకారంతోనే..: డీజీపీ
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలీసులతో పాటు ప్రజలంతా సహకరించారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈవీఎంలన్నింటినీ భారీ భద్రతతో స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించామని వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు 3 నెలల ముందే దీనిపై రాష్ట్ర పోలీసులు టీం వర్క్‌ చేశారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల బందోబస్తులో అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీ వెల్లడించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)