నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును ఓడించండి
Published on Sun, 03/24/2019 - 05:30
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా గత ఐదేళ్లు పరిపాలించిన టీడీపీని ఓడించాలని సీపీఐ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. అవకాశవాదం, పార్టీ ఫిరాయింపులు, భూ పందేరాలు, అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం మారుపేరుగా నిలిచిందని ధ్వజమెత్తింది. ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం మీడియాతో మాట్లాడారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనూ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనుకుంటున్న తీరు ఏవగింపు కలిగిస్తోందని మండిపడ్డారు. కాగా సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు డి.రాజా, సీతారాం ఏచూరీ ఈనెల 25న విజయవాడ రానున్నారని రామకృష్ణ చెప్పారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విజయవాడ బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
#
Tags