amp pages | Sakshi

రాష్ట్రాన్ని అంబానీకి అమ్మేసే కుట్ర

Published on Thu, 02/15/2018 - 11:44

నెహ్రూనగర్‌: రాష్ట్రాన్ని అమ్మేయడానికేనా రిలయన్స్‌ అధినేత అంబానీతో సీఎం చర్చలు జరిపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకటరమణ ఆరోపించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్య, వైద్య, సాగునీటి వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. సాగునీటి రంగంలోనూ పెట్టుబడులు తీసుకొచ్చి అన్నదాతను రోడ్డున పడేయాలని చూస్తున్నావా అంటూ మండిపడ్డారు.

అంబానీతో కలవడంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు యూనిట్‌ కరెంట్‌ చార్జీ రూ.2.75 పైసలు ఉంటే టీడీపీ అధికారంలోకి రాగానే రూ.9 వసూలు చేస్తున్నారని తెలిపారు. పెట్రోలు, డీజీల్‌ రేట్లు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ పెట్టుబడులకు వ్యతిరేకం కాదని, అన్యాయం జరిగితే మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిలారి రోశయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి మందపాటి శేషగిరిరావు, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)