amp pages | Sakshi

‘రాఫెల్‌’.. భారీ కుంభకోణం: ఉత్తమ్‌

Published on Thu, 07/26/2018 - 02:31

సాక్షి,హైదరాబాద్‌: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్రంలోని పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, దేశ భద్రత విషయంలో రాజీ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. యుద్ధవిమాన పైలట్‌గా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాల కొనుగోలు ధరను రహస్యంగా ఉంచడం దేశ చరిత్రలో లేదని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా, కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, మాజీఎంపీ వీహెచ్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ధర రహస్యమ ని ప్రధాని, రక్షణమంత్రులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. యుద్ధవిమానాలను ఉపయోగించే తీరు, శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతారని చెప్పారు. తాను కూడా మిగ్‌–21, మిగ్‌–23 విమానాలను నడిపానని, గతంలో ప్రభుత్వాలు జాగ్వార్, మిరాజ్‌ లాంటి యుద్ధవిమానాలను కొనుగోలు చేసినప్పుడు కూడా పార్లమెంటులో వాటి ధరలను చెప్పాయని గుర్తు చేశారు. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధనౌకను 2,330 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు 2010 మార్చి 15న లోక్‌సభలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని చెప్పారన్నారు.  

ఫ్రాన్స్‌ కంపెనీ నివేదికలో ధర వెల్లడి 
రాఫెల్‌ యుద్ధవిమానాలను సమకూర్చిన ఫ్రాన్స్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌తో యూపీఏ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.526 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుందని, అయితే, బీజేపీ ప్రభుత్వం దాన్ని మూడింతలు చేసి ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లు పెట్టి 36 విమానాలు కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ ధరలను కేంద్రం వెల్లడించకపోయినా, డసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ 2016లో ఇచ్చిన తన వార్షిక నివేదికలో చెప్పిందన్నారు. ఏవియేషన్‌ కంపెనీ తన నివేదికలో ధరలను బహిర్గతం చేసినప్పుడు కేంద్రం ఎందుకు దాచిపెడుతుందో అర్థం కావడం లేదన్నారు. అసలు ఈ ధరను నిర్ణయించేందుకు గాను సంప్రదింపుల కమిటీని వేయలేదని, రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు లోక్‌సభలో ప్రధాని చెప్పే నాటికి భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపించారు. యుద్ధవిమానాల కొనుగోలు ధరలను అడ్డగోలుగా పెంచడంతోపాటు వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే కాంట్రాక్టును అనిల్‌అంబానీకి చెందిన ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారన్నా రు. రక్షణ సామగ్రిని తయారు చేసిన చరిత్ర లేని ప్రైవేటు కంపెనీకి 36 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కుంతియా మాట్లాడుతూ రాఫెల్‌ కుంభకోణానికి, అమిత్‌షా కుమారుడి ఆస్తులు పెరగడానికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.   

ప్రభుత్వ వైఫల్యాలపై నివేదికలివ్వండి 
ఏఐసీసీ కార్యదర్శుల ఆదేశాలు 
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ కార్యదర్శులు ఆదేశించారు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గాలపై నిర్వహించిన సమీక్షలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి ఎన్‌.బోసురాజులు పాల్గొని మాట్లాడారు. 

Videos

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)