amp pages | Sakshi

వామపక్షాలు బలపడితేనే పేదరికం అంతం

Published on Tue, 04/03/2018 - 02:20

సాక్షి, హైదరాబాద్‌ :  వామపక్షాలు దేశవ్యాప్తంగా బలోపేతమైతేనే పేదరికం అంతమవుతుందని, నిరుద్యోగం పోతుందని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపంలో సోమవారం రెండోరోజు జరిగిన సమావేశాలను సీపీఐ సీనియర్‌ నాయకుడు జి.యాదగిరిరెడ్డి పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అమరవీరుల స్మారకస్థూపాన్ని ఆవిష్కరించారు.

ఈ మహాసభలకు సౌహార్ద ప్రతినిధులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్‌ఎస్‌పీ నేత సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. సురవరం మాట్లాడుతూ దేశంలో 71 శాతం సంపద కేవలం ఒక శాతం మంది సంపన్నుల వద్దే కేంద్రీకృతమైందన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీల ఆస్తులు 80 శాతం పెరిగాయన్నారు. ఈ నాలుగేళ్లలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బ ణం పెరిగాయన్నారు.

వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులకు గిట్టుబాటుధర లేక దళారుల దోపిడీతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదం, గోరక్ష పేరిట దాడులు, దళితులు, మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ, వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. మతోన్మాదులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, దళిత, లౌకిక శక్తులతో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించాలన్నారు.

హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల్లో సీపీఐ సహా అన్ని వామపక్షాలు పాల్గొంటాయని వెల్లడించారు. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ నామరూపాల్లేకుండా పోయిందన్నారు. ఏపీలో వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.  

వామపక్ష ఐక్యత కోసం ఉత్సాహంగా ఉన్నాం: తమ్మినేని
మతోన్మాదానికి, దళితులు, మైనారిటీపై దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వామపక్షాల ఐక్యత కోసం సీపీఎం ఉత్సాహంగా ఉందని చెప్పారు. మతోన్మాదం రాజకీయ రంగు పులుముకుందన్నారు.

అట్టడుగు కులాలు రాజ్యాధికారం చేజిక్కించుకున్నప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. సమావేశాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అతుల్‌కుమార్‌ ప్రసంగించారు. సంతాప తీర్మానాలను మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను అతుల్‌కుమార్‌ ప్రారంభించారు.  

వడగండ్ల బాధితులను ఆదుకోవాలి: చాడ
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడ గండ్లతో నష్టపోయిన అన్ని పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ఠపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎండిపోయిన, అకాలవర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలకు ఎకరానికి 40 వేలు, మామిడి పంటకు 50 వేలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటలకు నష్టపరిహారం చెల్లించాలని చాడ వెంకటరెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి మహాసభ ఆమోదం తెలిపింది.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)