amp pages | Sakshi

అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ, జనసేన పథకం

Published on Thu, 03/12/2020 - 08:03

సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రశాంతంగా సాగుతున్న స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ, జనసేన నేతలు పథకం వేశారు. అందులో భాగంగా మూడు రోజులుగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల నామినేషన్‌ చివరి రోజు బుధవారం పుంగనూరు, చంద్రగిరి, గంగాధరనెల్లూరు పరిధిలో టీడీపీ, జనసేన నాయకులు నానా హంగామా చేశారు. పుంగనూరు మండలం కుమ్మరనత్తం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రెడ్డెప్ప నామినేషన్‌ దాఖలు చేశారు. జనసేన నాయకుడు హరిరాయల్‌ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రెడ్డెప్ప చిన్నాన్న కుమారుడు హరితో నామినేషన్‌ వేయించేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న రెడ్డప్ప తన తమ్ముడు హరిని బలవంతంగా లాక్కురావటంపై గొడవకు దిగారు. అదే సమయంలో వారి చేత ఉన్న పత్రాలు బంధువులైన ఇద్దరు చించుకున్నారు. ఆ తర్వాత హరి నామినేషన్‌ వెయ్యకుండా నివాసానికి చేరుకున్నారు.

చంద్రగిరి నియోజకవర్గం పాకాల–2 ఎంపీటీసీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించారు. ఆ స్థానానికి టీడీపీకి అభ్యర్థి దొరకలేదు. ఎస్సీ వర్గానికి చెందినడేవిడ్‌ రవి భార్య ప్రియాంకతో నామినేషన్‌ వేయించేందుకు సిద్ధమయ్యారు. వీరి అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న రవి దౌర్జన్యం చేస్తున్నారంటూ కేకలు వేశారు. అందుబాటులో ఉన్న పోలీసులు కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్‌ వేయించారు. అప్పటికి కూడా నామినేషన్‌ పత్రాన్ని బలపరిచే వ్యక్తులు ఎవ్వరూ ముందుకు రాలేదు. వాస్తవాన్ని మరుగుపరిచేందుకు టీడీపీ శ్రేణులు నానా హంగామా చేస్తూ గొడవ పడుతున్నట్లు సృష్టించారు. దీన్ని వారి అనుకూలురు పెద్దగా ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే కార్వేటినగరం డైట్‌ కళాశాల ఎస్టీ కాలనీకి చెందిన వారు మండల కేంద్రానికి చేరుకున్నారు. వ్యక్తిగత విషయాలపై ఇరువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న నివాస పత్రాలు కిందపడ్డాయి. కిందపడ్డ పత్రాలను తీసుకునేందుకు ఇరువురు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో ఆ పత్రాలు చిరిగిపోయాయి. అయితే ఈ విషయంపై టీడీపీ శ్రేణులు అసత్య ప్రచారానికి దిగాయి. అలాగే  టీడీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కామేష్‌ యాదవ్‌ ఇంట్లో  ఎక్సైజ్‌ పో లీసులు 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై దౌర్జన్యానికి దిగాడు. అదేవిధంగా రేణిగుంట తహసీల్దార్‌ కార్యాలయంలో బొజ్జల సుధీర్‌రెడ్డి వీరంగం సృష్టించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)