amp pages | Sakshi

పార్లమెంట్‌ సాక్షిగా..

Published on Wed, 07/18/2018 - 03:34

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నుంచి, ఎన్డీఏ నుంచి తాము వైదొలిగామని టీడీపీ చెబుతున్నా.. వారి మధ్య లోపాయికారీ బంధం ఇంకా బలంగా కొనసాగుతోందని తాజాగా మరో ఉదంతం స్పష్టం చేసింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరేందుకు  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అన్ని పక్షాలతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే మంగళవారం ఉదయం పార్లమెంట్‌ భవనంలో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీ సాక్షిగా బీజేపీ, టీడీపీల స్నేహబంధం మరోసారి బట్టబయలైంది. తమ పార్టీ టిక్కెట్‌పై గెలుపొందిన ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరినందున ఆమెపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు గతంలో ఇచ్చిన లేఖ పెండింగ్‌లో ఉండగానే.. ఆమెను వైఎస్సార్‌ సీపీ ప్రతినిధిగా పరిగణిస్తూ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ ఆహ్వానం పంపారు.

ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ పక్ష నేతగా హాజరైన ఎంపీ వి.విజయసాయిరెడ్డి వివిధ పక్షాల నేతల స్థానాల్లో ఆయా సభ్యుల పేర్లతో పాటు బుట్టా రేణుక నామ ఫలకం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశం ప్రారంభంలోనే దీనిపై మంత్రి అనంతకుమార్‌ను నిలదీశారు. తమ పార్టీ లోక్‌సభ సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసీ పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను ఎలా పిలిచారని ప్రశ్నించారు. తక్షణం ఆ నామఫలకాన్ని ఉపసంహరించని పక్షంలో సమావేశాన్ని బహిష్కరిస్తానని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉందని మంత్రి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా విపక్ష నేతలంతా విజయసాయిరెడ్డిని సమర్థించారు. దీంతో బుట్టా రేణుక నామఫలకాన్ని తొలగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆదేశించారు. 

టీడీపీ–బీజేపీ లోపాయికారీ ఒప్పందాలు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించినా బీజేపీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యతాన్ని మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్య సప్న మునగంటివార్‌కు ఇవ్వడం, ఇటీవల పోలవరం సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీతో చంద్రబాబు సన్నిహితంగా మసలుకోవడం, నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఎదుట చంద్రబాబు వంగిపోయి వినయంగా నమస్కరించడం తెలిసిందే. ఇవేవో కాకతాళీయంగా జరిగిన ఘటనలు కావని, రెండు పార్టీల సత్సంబంధాలను ఇది బహిర్గతం చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  

ఎన్నికల భయంతో టీడీపీ డ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రానికి ప్రతి అడుగులోనూ సహకరించిన టీడీపీ ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రకటించడం తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు నాలుగేళ్లుగా పార్లమెంట్‌లో ఆందోళన చేయడం, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూ యువభేరీలు, దీక్షలు, ధర్నాలతో చైతన్యం రగల్చడంతో గత్యంతరం లేక టీడీపీ యూటర్న్‌ తీసుకుంది. నాలుగేళ్ల తరువాత తాపీగా హోదా కావాలంటూ ప్లేటు ఫిరాయించింది. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు సర్కారు లొంగిన వైనాన్ని మరిచిపోయేలా చేసేందుకు పార్లమెంటు బయటా, లోపల నాటకాలు ప్రదర్శించింది.

వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తే టీడీపీ కూడా ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని తెలిసి ఒక్క పూట సభ లోపల, సెంట్రల్‌ హాల్‌లో టీడీపీ ఎంపీలు దీక్ష చేస్తున్నట్టు నటించారు. ఇప్పుడు ఎన్నికల భయంతో కేంద్రంపై అవిశ్వాసం పేరుతో మరో నాటకానికి సిద్ధమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని రకాలుగా ప్రయత్నించి చివరికి రాజీనామాలకు సైతం వెనుకాడకుండా పదవులను వీడిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలపై దుష్ప్రచారం చేసేందుకు టీడీపీ ఒడిగట్టింది. తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు, లోపాయికారీ ఒప్పందాలకు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)