వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
కమలం వైపు.. టీడీపీ మిడతల దండు!
Published on Mon, 07/06/2020 - 10:35
సాక్షి, అమరావతి: ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నాయని గ్రహించేలోగానే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని చెప్పారు. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలన్నారు. (పాజిటివ్ ఉన్నా లక్షణాల్లేవా!)
అవసరాల కోసం స్వార్థంతో జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని హెచ్చరించారు. మీడియా ఎంటర్టైనర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని తెలిపారు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. (మిలియన్ మార్క్)
Tags