amp pages | Sakshi

‘ఇటలీ నుంచి ఇంకేదో కావాలేమో’

Published on Tue, 03/05/2019 - 08:32

సాక్షి, చెన్నై: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారికి భారత ఇంజనీర్ల ప్రతిభ నచ్చడంలేదని, ఇటలీ నుంచి  వారికి ఇంకా ఎదో కావాలని మండిపడ్డారు. దేశ శ్రామికులు, ఇంజనీర్ల కృషి ఫలితంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను రూపొందించడం వారు జీర్ణించుకులేకపోతున్నారని విమర్శించారు. భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమేనని గోయల్‌ అన్నారు. కార్మికులు అహోరాత్రులు కృషిచేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్‌ 18పై రాహుల్‌ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు. సోమవారం దక్షిణ తమినాడులో 1000 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును, 150 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను గోయల్‌ జాతికి అంకితం చేశారు. (‘వందే భారత్‌’ బ్రేక్‌ డౌన్‌!)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాంలో గోయల్‌ మాట్లాడారు. దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అనుభవంతో టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేయలని భావిస్తున్నామని, కానీ ఇంటలీ నుంచి దిగుమతి చేసుకోవాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని వ్యంగ్యంగా విమర్శించారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన మరుసటి రోజే వారణాసి నుంచి ఢిల్లీకి తిరిగివస్తూ సాంకేతిక సమస్యలకు లోనవడంపై రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా తమిళనాడులోని నైవేలిలోని విద్యుత్‌ ప్లాంట్‌ కార్మికుల శ్రమను గుర్తించిన కేంద్రమంత్రి నెలజీతంలో రూ.ఎనిమిదివేల  పెంచుతున్నట్లు ప్రకటించారు. శ్రామికుల కష్టాన్ని ఈ దేశం మర్చిపోదనన్నారు. 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?