amp pages | Sakshi

రాప్తాడు చరిత్రలో..తొలి తిరుగుబాటు

Published on Tue, 04/09/2019 - 11:12

ఈ ఏడాది ఫిబ్రవరి 3న తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రోజులు ముందుగా గ్రామస్తులకు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. దాదాపు ఎన్నికలకు ఒక నెల ముందు సంక్షేమ ఫలాలు అందజేసే కార్యక్రమాలకు మంత్రి తెరలేపడంపై స్థానికులు భగ్గుమన్నారు. ఇంత కాలం తమ గ్రామంలోని ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించని ఆమెకు గ్రామంలో కాలు పెట్టే అర్హత లేదని, కాదూకూడదంటూ గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంక్‌ల్లో డీఫాల్టర్లుగా మారాల్సి వచ్చిందని దీనికంతకూ కారణం టీడీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. పరువు దక్కించుకునేందుకు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంక్‌లకు వడ్డీలు కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చలేని అసమర్థ మంత్రి తమకు అక్కర లేదంటూ తేల్చి చెప్పారు. పసుపు – కుంకుమ పేరుతో వేసే భిక్షం తమకు అక్కర లేదని, చేయగలిగితే పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి గ్రామంలోకి కాలు పెట్టాలని సవాల్‌ విసిరారు. దీనిపై మంత్రి కూడా అప్పట్లో స్పందించారు. గ్రామస్తుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకు ఇది ప్రతిపక్షాల కుట్ర అని దుమ్మెత్తిపోశారు. తన పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఘాటుగా స్పందించారు.

చివరకు ఫిబ్రవరి 3వ తేదీ రానేవచ్చింది. ఉదయం నుంచి గ్రామంలో వాహనాలు రాకుండా స్థానికులు కాపుకాసారు. మంత్రి ఆదేశాల మేరకు సాక్షాత్తూ ఎస్సీ జీవీజీ అశోక్‌కుమార్‌ నేరుగా రంగంలోకి దిగారు. భారీగా పోలీసు బలగాలను గ్రామంలో మొహరింపజేసి మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు కేవలం మహిళలే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. చివరకు మంత్రి సునీత కాన్వాయ్‌ రానే వచ్చింది. సభావేదిక వద్దకు నేరుగా వెళ్లేందుకు మంత్రి ప్రయత్నించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఇక తమ చేతికి చిక్కిన చీపర్లు, చెప్పులను మంత్రి కాన్వాయ్‌పై విసిరారు. ఇచ్చిన హామీలు నెరవ్చేకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్‌ అంటూ నినదించారు. మంత్రికి జరిగిన ఈ ఘోర పరాభవం నేటికీ నియోజకవర్గ ప్రజల మది నుంచి చెరిగిపోలేదు. హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఆమె ఇంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.    

గ్రామ స్వపరిపాలనకు స్వర్ణయుగం 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ స్వపరిపాలన అనేది స్వర్ణయుగంలా సాగింది. గ్రామ పరిధిలో ఏ పని చేయాలన్నా.. స్థానిక ప్రజాప్రతినిధులదే తుదినిర్ణయంగా ఉండేది. దీని వల్ల గ్రామాల్లో చాలా వరకు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వపరిపాలనను అపహాస్యం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేశారు. అక్రమాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. భూదందాలు, భూకబ్జాల పెచ్చరిల్లాయి. పొరబాటున మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ అరాచక పాలనను భరించలేం. గతంలోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చాలా దుర్మార్గమైన పాలన కొనసాగించారు. ఇంతటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మళ్లీ వైఎస్సార్‌ పాలన రావాలి. ఇది కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది. – మారుతీప్రసాద్‌ , తాజామాజీ సర్పంచ్, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్‌ మండలం  

వైఎస్సార్‌ చేయూత’ 
చంద్రబాబు పాలనలో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల అవకాశాన్ని కోల్పోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించక చాలా మంది మధ్యలోనే చదువులు మానేశారు. రుణమాఫీ కాక రైతులు నానా అవస్థలు పడ్డారు. బ్యాంక్‌ల్లో డ్వాక్రా మహిళలు డీఫాల్టరయ్యారు. హౌసింగ్‌ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పునాదుల దశలోనే పేదల సొంతింటి కల నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ప్రజలు అన్ని విధాలుగా దగాపడ్డారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారు.

నవరత్న పథకాలను ప్రకటించి ప్రతి ఒక్కరికీ అభయమిచ్చారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 1 లక్ష వైఎస్సార్‌ కానుకగా ఇస్తానని పేర్కొనడం చాలా బాగుంది. అన్ని కులాల వారికీ ప్రత్యేక కార్పొరేషన్ల ు ఏర్పాటు చేసి జీవనోపాధుల పెంపునకు కృషి చేస్తాననడం చాలా బాగుంది. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు.  – రవి, కళ్యాణదుర్గం   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)