amp pages | Sakshi

నేడు బహిరంగసభ

Published on Mon, 05/21/2018 - 08:58

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ సెంటర్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ జరగనుంది. వాస్తవానికి ఆదివారం ఈ సభ జరగాల్సి ఉంది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యులు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో వై.ఎస్‌.జగన్‌ తన పాదయాత్రను, బహిరంగసభను రద్దు చేసుకుని హుటాహుటిన ఆదివారం ఉదయం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి శనివారం రాత్రే సోమయాజులును పరామర్శించేందుకు వెళ్లాల్సి ఉండగా, ఆయన ఆరోగ్యం బాగుందన్న సమాచారం తెలియడంతో వై.ఎస్‌.జగన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

ఈ తరుణంలో ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజా సంకల్ప యాత్ర యథావిధిగా జరుగుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితేఅనుకోనివిధంగా ఆదివారం తెల్లవారుజాము∙3.50 గంటలకు సోమయాజులు మరణవార్త తెలియడంతో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెనువెంటనే హైదరాబాద్‌ వెళ్లారు. మండలంలోని వెల్లమిల్లి స్టేజ్‌ వద్ద నుంచి జాతీయ రహదారి 16 మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌  వెళ్లారు. అక్కడ సోమయాజులు భౌతిక కాయాన్ని వై.ఎస్‌.జగన్‌ సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, డి.ఎ.సోమయాజులు మృతికి వైఎస్సార్‌ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ సంతాపం తెలిపారు.

నేడు యథావిధిగా పాదయాత్ర
ఇదిలా ఉంటే సోమవారం ఉదయం 8 గంటలకు ప్రజాసంకల్ప పాదయాత్ర యథావిధిగా ప్రారంభం అవుతుంది. వెల్లమిల్లి స్టేజి, పెద తాడేపల్లి మీదుగా తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. తాడేపల్లిగూడెంలో జరిగే సభలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సభను జయప్రదం చేయండి : కొట్టు
తాడేపల్లిగూడెం మార్కెట్‌ సెంటర్‌లో సోమవారం సాయంత్రం జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వైఎస్సార్‌ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ కోరారు.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)