amp pages | Sakshi

బాబును కాపాడేలా ‘సోమయాజులు’ నివేదిక

Published on Thu, 09/20/2018 - 04:15

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, భక్తుల మరణంపై జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ ఇచ్చిన నివేదిక సీఎం చంద్రబాబును కాపాడే రీతిలో, వాస్తవాలను మరుగుపర్చేలా ఉండడం దారుణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.  ఆ దుర్ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించకుండానే టీడీపీ కార్యాలయంలో కూర్చుని నివేదికను రూపొందించారా? అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబే దీన్ని తయారుచేసి, సోమయాజులు చేత సంతకం పెట్టించి ఉంటారన్నారు. ఇలాంటి ఏకపక్ష నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు గుడ్డినమ్మకంతో, ఇంగితం మరిచి పుష్కరాలకు వచ్చారని సోమయాజులు కమిషన్‌ నివేదికలో పేర్కొనడం దారుణం.

మీడియా తప్పుడు ప్రచారం వల్ల, మూఢ విశ్వాసాల వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పడాన్ని చూస్తే ఇది అసలు కమిషనేనా లేక చంద్రబాబును కాపాడటానికి ఇచ్చిన రిపోర్టా అన్న అనుమానం కలుగుతోంది. ఇంత దౌర్భాగ్యమైన నివేదికను ఎప్పుడూ, ఏ కమిషనూ ఇవ్వలేదు. తప్పంతా మీడియా, భక్తులపైనే నెట్టడం సమంజసం కాదు. దుర్ఘటన జరిగిన మరుసటి రోజు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను కమిషన్‌ పట్టించుకోలేదు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాతే చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని జిల్లా పోలీసు అధికారి కూడా తెలిపారు.

ఇన్ని ఆధారాలు కళ్లముందు ఉన్నా, చంద్రబాబును కాపాడే రీతిలో కమిషన్‌ నివేదిక ఇవ్వడం దారుణం’’ అని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రచార యావ వల్లే ఇంత ఘోరం జరిగితే, సోమయాజులు కమిషన్‌.. ప్రతిపక్షాలను తప్పుబట్టడం ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నవాళ్లను కాపాడడమే కమిషన్‌ కర్తవ్యంగా పెట్టుకుంది. కనీస మానవత్వం కూడా లేకుండా కమిషన్‌ చేత తప్పుడు నివేదిక ఇప్పించిన చంద్రబాబును ప్రజలు క్షమించరు. ఈ నివేదికను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’’ అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)