amp pages | Sakshi

మోదీ ఎందుకు ట్వీట్‌ చేయలేదు?

Published on Mon, 03/18/2019 - 18:01

సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై మార్చి 15న దాడి జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది చర్యను తీవ్రంగా ఖండిస్తూ పలువురు దేశాధినేతలు సొంత ట్విట్టర్‌ ఖాతాల ద్వారా స్పందించారు. బాధితులకు నివాళులర్పించారు. ఆ మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్‌ నిర్ధారించినప్పటికీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు తన సొంత ట్విట్టర్‌ ద్వారా స్పందించక పోవడం పట్ల విమర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలే కాకుండా పాకిస్థాన్‌లో జరిగిన టెర్రరిస్టు దాడుల సందర్భాల్లో కూడా తక్షణమే స్పందించి మృతులకు నివాళులర్పించే మోదీ ఏకంగా 50 మంది పొట్టన పెట్టుకున్న ఉన్మాది చర్యపై స్వయంగా స్పందించక పోవడం ఏమిటన్నది వారి ప్రశ్న.

అయితే అదే రోజు నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేస్తూ న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్దర్న్‌కు ఓ లేఖ రాశారంటూ భారత విదేశాంగ శాఖ ఓ లేఖను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడియు, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తదితరులు వ్యక్తిగతంగా స్పందిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపారు. భారత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తదితరులు వ్యక్తిగత ఖాతాలా ద్వారా సోషల్‌ మీడియాలో స్పందించారు.

పెషావర్‌ స్కూల్‌లో టెర్రరిస్టు దాడికి 156 మంది చనిపోయినప్పుడు 2014, డిసెంబర్‌లో ప్రధాని మోదీ తన ట్వట్టర్‌లో స్పందించారు. 2015, జనవరి నెలలో పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రికా కార్యాలయంలో టెర్రరిస్టులు దాడి చేసి 17 మందిని చంపినప్పుడు కూడా మోదీ వెంటనే స్పందించారు. ఆ తర్వాత మే నెలలో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు ఓ బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 46 మంది చనిపోయినప్పుడు కూడా ఆయన తన ట్విటర్‌ ఖాతా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. గత మార్చి 14వ తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతనెలో ఓ భాగం కూలి ఆరుగురు మరణించినప్పుడు కూడా మోదీ స్వయంగా స్పందించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈసారి ఆయన సొంతంగా స్పందించక పోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన దాడులకు ముస్లిం టెర్రరిస్టులు బాధ్యులవడం, న్యూజిలాండ్‌లో జరిగిన దాడికి ఓ శ్వేత జాత్యాహంకారి బాధ్యుడు అవడం, అందులోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం లాంటి అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా స్పందించకపోయి ఉండవచ్చన్నది విమర్శకుల వాదన.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)