amp pages | Sakshi

తిరుమల చేరుకున్న వైఎస్‌ జగన్‌

Published on Tue, 05/28/2019 - 17:51

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఆయనకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జననేతకు శాలువా కప్పి సత్కరించారు. ఇక, తిరుమలలో వైఎస్‌ జగన్‌కు టీటీడీ ఈవో అనీల్‌కుమార్‌ సింఘాల్‌, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న సాదరంగా స్వాగతం  పలికారు. వైఎస్‌ జగన్‌ వెంట పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, అనీల్ యాదవ్ తదితరులు ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం కుటుంబసమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే వైఎస్‌ జగన్‌ ఏ కార్యక్రమమైనా చేపట్టడం అనవాయితీగా వస్తోంది. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని స్వామిని కోరనున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతకుముందు ఆయన తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు.. జననేతకు ఘనస్వాగతం పలికారు. కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరీ.. వైఎస్‌ జగన్‌  అభిమానులకు, ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అందించిన శాలువాలు, పుష్పగుచ్ఛాలను స్వీకరించారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో వైఎస్‌ జగన్‌ తిరుమలకు చేరుకున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి  వైఎస్సార్ జిల్లా కడపకు చేరనున్నారు. కడపలోని  పెద్ద దర్గాను దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం చాదర్‌ను సమర్పించనున్నారు. కడప దర్గాను సందర్శించిన అనంతరం చాపర్‌ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)