నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
180వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర
Published on Mon, 06/04/2018 - 09:02
సాక్షి, ఆచంట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ సోమవారం ఉదయం పెనుగొండ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా యర్రాయిచెరువు వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు జననేత 2,236 కిలో మీటర్ల దూరం నడిచారు.
Tags