ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
Breaking News
ఆ అభ్యర్థులంతా చంద్రబాబు చెంచాలే : విజయసాయి రెడ్డి
Published on Thu, 03/28/2019 - 09:19
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీడీపీ మట్టికొట్టుకుపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. జనసేన, కాంగ్రెస్, కేఏ పాల్ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులందరినీ చంద్రబాబే ఎంపిక చేసి వారికి నిధులు సమాకూర్చారని ఆరోపించారు. ఆ 500 మంది అభ్యర్థులు చంద్రబాబు చెంచాలని విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన కార్యకర్తలతో నామినేషన్లు వేయించిన తీరు చూస్తేనే వాళ్లకు ఓటమి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోందని అన్నారు.
వాళ్లేం కామెడీలు చేస్తారో..
వైఎస్ జగన్కి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వెయ్యికోట్లు పంపించారని చంద్రబాబు గాల్లోకి బాణం వదిలారు. ఆయన పిలిపించుకున్న రిటైర్డు పొలిటీషియన్ ఫరూక్ అబ్దుల్లా సీఎం పోస్టుకు 1500 కోట్లు సోనియాకు ఆఫర్ చేశాడని బురదజల్లారు. రేపు మమతా బెనర్జీ లాంటి వాళ్లు వచ్చి ఇంకేం కామెడీలు చేసిపోతారో చూడాలి అని ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ అని పార్టీ పెట్టుకున్న ఫరూక్ దోస్తీ మాత్రం కాంగ్రెస్తోనే అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
(చదవండి : కుట్రల చంద్రుడి మరో కుయుక్తి)
Tags