amp pages | Sakshi

ఆ నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు..!

Published on Sat, 01/25/2020 - 17:08

సాక్షి, తాడేపల్లి: అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని.. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమని భావించామని.. దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పారు. బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజధాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారని.. బీజేపీతో చర్చించామని మేము ఎప్పుడైనా చెప్పామా అని అంబటి ప్రశ్నించారు. తమ నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా అని అంబటి ప్రశ్నిస్తూ.. బీజేపీ మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించారు.

హైకోర్టును శాశ్వతంగా సీమలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. హైకోర్టుపై బీజేపీ కట్టుబడి ఉందో లేదో సమాధానం చెప్పాలన్నారు. ‘అమరావతి నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా సాగుతుందని చెప్పింది నిజం కాదా..? అధికారంలోకి రాగానే రాజధాని రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఆ హామీలు బీజేపీ నేతలకు గుర్తున్నాయా?’ అని అంబటి దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు బీజేపీ అండదండలు ఇంకా దేనికని.. చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీ, జనసేన పనిచేస్తున్నాయని విమర్శించారు. 151 సీట్లు ఇచ్చి.. ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం తమ​‍కు ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని పేర్కొన్నారు.

మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అని విశ్వసిస్తున్నామని.. చంద్రబాబు నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరం తమ లేదని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తమకో అభివృద్ధి విధానం ఉందని వెల్లడించారు. విశాఖలో తాము భూ దందాలు చేస్తున్నామని పవన్‌ అంటున్నారని.. భూదందా చేసి పాలన సాగించాల్సిన దుస్థితి తమకు లేదన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా  అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

‘ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసింది చంద్రబాబు నాయుడే. ఫిరాయింపులను ప్రోత్సహించింది కూడా ఆయనే. తమ పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు.. కీలకమైన బిల్లు పై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు.. నిబంధనలకు విరుద్ధంగా గ్యాలరీలో కూర్చున్నారు.. ఛైర్మన్ పై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం’  అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)