అజ్ఞాతవాసుల సర్వే

Published on Thu, 01/18/2018 - 04:20

నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడునెలలుగా గుట్టుచప్పుడు కాకుండా 50 మందితో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇంటింటి సర్వే చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల వ్యక్తుల పేర్లు, మతం, కులం, ఆధార్, ఫోన్‌ నంబర్, ఓటర్‌కార్డు.. ఇలా సమగ్ర వివరాలను సేకరించారు. ఎవరైనా సర్వే ఎందుకని అడిగితే నగరపాలకసంస్థ తరఫున చేస్తున్నామని చెబుతున్నారు. కార్పొరేషన్‌ నుంచి వచ్చామని చెప్పడంతో ప్రజలు సైతం వారికి పూర్తి వివరాలు అందజేస్తున్నారు. కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతోందని తెలిసింది. 

నారాయణ ఆదేశాలతోనే..
మంత్రి నారాయణ ఆదేశాలతోనే సర్వే చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కార్పొరేషన్‌ పేరును వాడుకుంటూ చేయిస్తున్నారని తెలిసింది. ఈ విషయం నగరపాలక సంస్థలో పలువురు అధికారులకు తెలిసినా మున్సిపల్‌ శాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం కావడంతో స్పందించడం లేదని చెబుతున్నారు. 

ఇలా బయటపడింది
నగరంలోని 50వ డివిజన్‌లో ఉన్న సం తపేటలో కొత్తూరుకు చెందిన పర్వేజ్‌ అనే వ్యక్తి కొంతకాలం క్రితం సర్వే చేశాడు. ఇటీవల అతను మళ్లీ డివి జన్‌కు వెళ్లి హౌస్‌ఫర్‌ఆల్‌ కింద ఇళ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలి కాడు. ప్రతి దరఖాస్తుదారుడు రూ.2, 000 చెల్లిస్తే ఇళ్లు మంజూరవుతుందని చెప్పారు. కొందరు కార్పొరేషన్‌ సిబ్బంది కదా అని నగదు ఇచ్చారు. బీజేపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో బుధవారం ఉదయం ఆయన సంతపేటలో పర్వేజ్‌ను పట్టుకుని నిలదీశారు. 

అతను కార్పొరేషన్‌ నుంచి వచ్చినట్లు చెప్పొకొచ్చాడు. శ్రీనివాసులు కార్పొరేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడగా తమకు సంబంధం లేదని చెప్పారు. దీంతో అతను మాటమార్చి తాను మంత్రి నారాయణ కోసం సర్వే చేస్తున్నట్లు వెల్లడించాడు. పర్వేజ్‌ వద్ద సర్వే పుస్తకం కూడా ఉండటంతో శ్రీనివాసులు అతడిని కార్పొరేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులకు చూపించి అడగ్గా వారు తమకు తెలియదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అక్కడే టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో సమావేశంలో ఉన్న మంత్రి నారాయణ వద్దకు పర్వేజ్‌ను తీసుకెళ్లారు.

 నారాయణ తాను ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని, నాలుగోనగర పోలీసులను పిలిపించి అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పర్వేజ్‌ను పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సర్వే పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా సర్వే వ్యవహారం బయటపడటంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సర్వే చేసిన కొందరు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి నగదు వసూలు చేసినట్లు సమాచారం.

Videos

భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి

భారీగా వీడియోలు కొన్న నారా లోకేష్..

బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..

ఓటమి భయంతోనే చంద్రబాబు ...కూటమిని ఏకిపారేసిన బొత్స

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

అర్ధరాత్రి దాకా విచారణ.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం

టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..

టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్

Photos

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)

+5

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)