amp pages | Sakshi

నిజమైన దేశభక్తులు ఇలా చేయరు.. అంతేగా కోహ్లి!!

Published on Mon, 02/25/2019 - 20:35

టీమిండియా- ఆసీస్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అభిమానులు ప్రవర్తించిన తీరుపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన దేశభక్తులెవరూ ఈవిధంగా చేయరంటూ నెటిజన్లు ప్రేక్షకులపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే... భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య విశాఖపట్నంలో తొలి టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించిన తర్వాత... పుల్వామా ఘటనకు సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అయితే ఆ సమయంలో భారత్‌ మాతాకీ జై అంటూ ప్రేక్షకులు గట్టిగా నినాదాలు చేయడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు. మౌనంగా ఉండాలంటూ ప్రేక్షకులకు సైగలతో సూచించాడు.

కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు...‘ పుల్వామా ఉ‍‍గ్రదాడిలో అమరులైన జవాన్లకు మౌనం పాటించే సమయంలో కొంతమంది ఎలా ప్రవర్తించాలో మర్చిపోయారు. బుద్ధి లేకుండా అరుస్తూ, చీర్‌ చేస్తారా... కొంత మంది ఫోన్లు చూసుకుంటారు. నిజమైన దేశ భక్తులు ఇలా చేయరు. దురభిమానానికి, ఉన్మాదానికి ఇది మరొక ఉదాహరణ. మళ్లీ వాళ్లే దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతారు’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఇక ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?