విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రపంచ పారా అథ్లెటిక్స్లో అమిత్కు రజతం
Published on Tue, 07/18/2017 - 01:27
లండన్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ రజత పతకం సాధించాడు. పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీల్లో అతను 30.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈ ప్రదర్శన చేయడం ద్వారా అమిత్ కొత్త ఆసియా రికార్డును నమోదు చేశాడు. ఈ ఈవెంట్లో జెల్జ్కో (సెర్బియా; 31.99 మీ.) ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం నెగ్గాడు. భారత్కే చెందిన ధరంబిర్ (22.34 మీ.) పదో స్థానంలో నిలిచాడు. అమిత్ కుమార్ నేడు (మంగళవారం) డిస్కస్ త్రో ఎఫ్52 ఈవెంట్లో కూడా పోటీపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్కు చెందిన సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్ త్రో ఎఫ్46లో బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
#
Tags