నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
‘కోహ్లిని విలన్గా చిత్రీకరించేందుకు యత్నం’
Published on Fri, 12/21/2018 - 14:23
పెర్త్: ఆసీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బుధవారం నుంచి ఆరంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో ఇరుజట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్కు మధ్య చెలరేగిన వివాదం మాత్రం చల్లారటం లేదు. వారిద్దరూ ఇది మామూలు విషయమేనని కొట్టిపడేసినా మాజీలు, సీనియర్లు మాత్రం ఈ వివాదంపై స్పందిస్తూనే ఉన్నారు.
దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘ఆసీస్ మీడియా టీమిండియాపై కక్ష కట్టినట్లుంది. ప్రపంచ జట్ల ముందు టీమిండియా ఆటగాళ్లను ముఖ్యంగా కోహ్లిని విలన్గా చిత్రీకరించాలని చూస్తోంది. మీడియా, ఆసీస్ మాజీలు ఇలా ప్రవర్తించడం పట్ల ఆశ్చర్యమనిపిస్తోంది. ఆసీస్ ఆటగాళ్లెప్పుడూ ఇంతకు ముందు అలా ప్రవర్తించలేదా? ఒక సారి ఆసీస్ మీడియా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. వ్యక్తిగతంగా కోహ్లి అంటే ఏంటో నాకు తెలుసు. అతడి జట్టును దగ్గరుండి పరిశీలించాను. వారిలో ఎక్కడా తప్పు కనిపించలేదు. టీమిండియా ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించినట్లు అనిపించలేదు. ఆసీస్ మీడియా అనవసరంగా ఓవరాక్షన్ చేస్తోంది' అని మండిపడ్డాడు.
Tags