వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్కు 14 ఏళ్ల జైలు
Published on Wed, 12/30/2015 - 19:17
ఢాకా: ఇంట్లో పనిచేసే అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్షపడనుంది. షహదత్, ఆయన భార్య నృటో షహదత్పై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు పోలీసులు తెలిపారు.
షహదత్ దంపతులు తమ ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల అమ్మాయిని హింసించినట్టు వారిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. షహదత్ దంపతులపై వచ్చిన ఆరోపణలు తమ ప్రాథమిక దర్యాప్తులో నిజమని తేలినట్టు పోలీసులు చెప్పారు. కాగా తాము ఎలాంటి తప్పూ చేయలేదని షహదత్ వాదిస్తున్నాడు. తన కెరీర్ను నాశనం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించాడు. అతనిపై ఆరోపణలు రాగానే అన్ని ఫార్మాట్ల నుంచి బంగ్లా క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. బంగ్లా తరపున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు.
Tags