amp pages | Sakshi

‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అన్నారు’

Published on Fri, 05/29/2020 - 14:47

న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆటగాళ్లకు ఎంతటి ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఏ స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా ఆటగాళ్లలో గెలిచి తీరాలన్న కసి కనబడుతుంది. దాంతో ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అనేంతంగా ఇరు దేశాల క్రికెటర్లు మాటల యుద్ధానికి తెరతీస్తారు. ఇక్కడ ప్రేక్షకులు కూడా ఏమాత్రం తగ్గరు. ఆ క్రమంలోనే క్రికెటర్లపై విపరీతమైన స్లెడ్జింగ్‌కు దిగుతారు. ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. దాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు తాను స్లెడ్జింగ్‌ బారిన పడినట్లు ధావన్‌ తెలిపాడు. (‘అదే రోహిత్‌ను సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ చేసింది’)

‘గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంటే విపరీతమైన ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. మొత్తం మన ఫీలింగే మారిపోతుంది. మనం క్రికెటర్లమేనా అనే సంగతి కూడా మరిచిపోతాం. 2015లో పాక్‌తో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో నేను స్లెడ్జింగ్‌కు గురయ్యా. అప్పటికి నా ఫామ్‌ బాలేదు. వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో విఫలమయ్యా. అదే సమయంలో పాకిస్తాన్‌తో నా తొలి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌. నేను మ్యాచ్‌ జరిగే వేదికకు వెళుతున్నా. నన్ను చూసిన పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ అరపులతో గోల గోల చేశారు. నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అంటూ స్లెడ్జింగ్‌కు దిగారు. 15 పరుగులు చేసి ఔటయ్యే బ్యాట్స్‌మన్‌ అంటూ హేళన చేశారు. దానిని నేను లైట్‌గా తీసుకున్నా. కానీ మ్యాచ్‌లో 73 పరుగులతో మెరిశా. నన్ను ఎవరైతే హేళన చేశారో వారే నేను పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో  చప్పట్లతో అభినందించారు. (‘భారత్‌ ఓడిపోతుందని అనలేదు’)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)