నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
లార్డ్స్ టెస్ట్: భారత్దే బ్యాటింగ్
Published on Fri, 08/10/2018 - 15:32
లార్డ్స్: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గురువారం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దైన విషయం తెలిసిందే. వర్షం తగ్గడంతో శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ సారథి జోరూట్ ఫీల్డింగ్కు మొగ్గు చూపాడు. ఇక అంతా అనుకున్నట్లే భారత జట్టు నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ను తప్పించి చతేశ్వర పుజారాకు, ఉమేశ్ యాదవ్ స్థానంలో కుల్దీప్ యాదవ్కు అవకాశం కల్పించారు. ఇంగ్లండ్ జట్టులో బెన్స్టోక్స్ స్థానంలో క్రిస్ వోక్స్ వచ్చాడు.
ధావన్ గైర్హాజరితో కేఎల్ రాహుల్, మురళీ విజయ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే భారత్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే మురళీ విజయ్ వికెట్ను కోల్పోయింది. అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి మురళీ విజయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం పుజారా క్రీజులోకి వచ్చాడు.
చదవండి: కుంబ్లే ‘హీరో’చిత సెంచరీకి 11 ఏళ్లు
Tags