రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
Published on Sun, 10/28/2018 - 02:28
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 12–21, 24–26తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ జోడీ కెవిన్ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది.
శుక్రవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 19–21తో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్కిది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు 13–21, 16–21తో ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
#
Tags