amp pages | Sakshi

సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే కావాలి! 

Published on Sun, 03/22/2020 - 01:09

సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేకుండా పోయింది. ఫలితంగా భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన తొలి సెమీస్‌ రద్దు కాగా... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో సెమీస్‌లోనూ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ద్వారా ఫలితం తేలింది. అయితే లీగ్‌ దశలో ఎక్కువ విజయాలు సాధించడంతో ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌కు కనీసం రిజర్వ్‌ డే పెట్టకపోవడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రతిష్టాత్మక పురుషుల టి20 ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితి రాకూడదని ఆతిథ్య బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కోరుకుంటోంది. ఇప్పటికే అంగీకరించిన నిబంధనల ప్రకారం ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే ఉంది. ఇప్పుడు సెమీఫైనల్స్‌కు కూడా రిజర్వ్‌ డే పెట్టమంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేయాలని సీఏ నిర్ణయించింది. త్వరలో జరగనున్న ఐసీసీ క్రికెట్‌ కమిటీ సమావేశంలో సీఏ ఈ ప్రతిపాదన పెట్టనుంది.

ఈ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని, అనంతరం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ) ఆమోద ముద్ర వేస్తే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తుందని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరి కొన్ని నెలల్లో టోర్నీ జరగనున్న నేపథ్యంలో నిబంధనలు మార్చడం అరుదుగా జరుగుతుందని, అయితే ఐసీసీ సభ్యదేశాల్లో ఎవరైనా వీటిని మార్చే విషయంపై చర్చ జరపవచ్చని ఆయన చెప్పారు. ‘ఒక టోర్నీ జరిగిన తర్వాత మంచి చెడుల గురించి విశ్లేషించడం, రాబోయే టోర్నీకి ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోవడం ఎప్పుడైనా జరుగుతుంది. వేర్వేరు సమయంలో నిర్వహించినా టి20 ప్రపంచకప్‌ 2020కి సంబంధించి రెండు టోర్నీలకూ ఒకే తరహా నిబంధనలు మహిళా వరల్డ్‌ కప్‌ జరగక ముందే విధించారనేది వాస్తవం. అయితే నిబంధనల మార్పు గురించి మన వాదనలో వాస్తవం ఉండాలి. ఇంగ్లండ్‌ మహిళల జట్టు పరిస్థితి ఏమిటో మాకు బాగా తెలుసు. ఇప్పుడు మాలో చాలా మంది సెమీస్‌కు కూడా రిజర్వ్‌ డే ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు’ అని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబర్‌ 15 వరకు టి20 ప్రపంచ కప్‌ జరుగుతుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)