ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ శుభారంభం
Published on Fri, 06/16/2017 - 14:42
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. స్కాట్లాండ్తో గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో టీమిండియా 4–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో కెప్టెన్ క్రిస్ గ్రాసిక్ గోల్తో స్కాట్లాండ్ ఖాతా తెరిచింది.
ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న భారత్ ఆ తర్వాత జాగ్రత్తగా ఆడింది. 31వ, 34వ నిమిషాల్లో రమణ్దీప్ సింగ్ రెండు గోల్స్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్కు ఆకాశ్దీప్ సింగ్ (40వ నిమిషంలో), హర్మన్ప్రీత్ సింగ్ (42వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో కెనడాతో భారత్ తలపడుతుంది.
#
Tags