amp pages | Sakshi

ఇంగ్లండ్ ను తిప్పేస్తున్నారు...

Published on Mon, 11/28/2016 - 16:37

మొహాలి: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తడబాటును కొనసాగిస్తోంది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆటలో 417 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆ తరువాత కీలక ఇంగ్లండ్ వికెట్లను సాధించింది.  ఈ రోజు ఆటలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే అలెస్టర్ కుక్(12) మొయిన్ అలీ(5) వికెట్లను నష్టపోయింది. ఇంగ్లండ్ కోల్పోయిన తొలి రెండు వికెట్లను స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.