రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత టెస్టు చరిత్రలో దారుణమైన ఓటమి: గవాస్కర్
Published on Sat, 02/25/2017 - 20:13
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోవడం భారత్టెస్టు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిగా సునీల్ గవాస్కర్ అభివర్ణించారు. పూణే టెస్టు మ్యాచ్లో ఒకిఫ్ స్పిన్ మాయాజలానికి భారత్ 333 పరుగుల తేడాతో పరాజయం పొందింది. ఈ ఓటమిపై గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. భారత్ రెండున్నర రోజుల్లో ఆటముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆసీస్ స్పిన్నర్ల అటాకింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది భారత క్రికెట్కు బ్లాక్ డేగా పేర్కొన్నారు.
భారత్ బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్లను 75 ఓవర్లకు ముగించడం అసంతృప్తికి గురిచేసిందని గవాస్కర్ తెలిపారు. భారత ఆటగాళ్లు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చారని చెప్పారు. ట్రీ బ్రెక్ తర్వాత అరగంట సమయంలో భారత ఇన్నింగ్స్ ముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆటగాళ్లు కేర్లెస్గా ఆడారని , ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు గ్రహించి మిగతా మ్యాచ్లకు సిద్దం కావాలని గవాస్కర్ ఆటగాళ్లకు సూచించారు.
#
Tags