Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సునీల్, మన్ ప్రీత్ అవుట్
Published on Sat, 10/15/2016 - 11:56
బెంగళూరు:త్వరలో మలేషియాలో జరుగునున్న ఆసియా చాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఎస్ వి సునీల్, మన్ ప్రీత్ సింగ్ లు దూరం కానున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో వారికి విశ్రాంతి నివ్వనున్నట్లు కోచ్ ఓల్ట్మన్స్ తెలిపాడు. గత కొన్ని రోజులుగా సునీల్ మణికట్టు గాయంతో బాధపడుతుండగా, మన్ ప్రీత్ గజ్జల్లో గాయమైనట్లు పేర్కొన్నాడు.
అయితే మన్ ప్రీత్ గాయం తగ్గుముఖం పట్టినా, మళ్లీ తిరగెట్టే అవకాశం ఉన్నందును అతనికి విశ్రాంతి ఇస్తున్నట్లు ఓల్ట్మన్స్ తెలిపాడు. వీరి స్థానంలో రమణ్ దీప్ సింగ్, అక్షదీప్ సింగ్ లు జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి మలేషియాలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది.
#
Tags