ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లు
Published on Fri, 10/30/2015 - 23:45
భారత స్థూల జాతీయోత్పత్తిలో...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లు అని ఓ సర్వేలో తేలింది. భారత్లో ఈ సీజన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి అంశం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 2650 కోట్లు అని కేపీఎంజీ అనే ప్రఖ్యాత ఆర్థిక గణాంక సంస్థ చేపట్టిన సర్వేలో తేలినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. ఆతిథ్య నగరాలు కాకుండా ఇతర నగరాల నుంచి వచ్చిన 20 శాతం మంది అధికంగా ఈ పోటీలను తిలకించారు. ఇందులో యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.
ఇది ఆర్థికాంశాలపై బాగా ప్రభావం చూపింది. దీనివల్ల రకరకాల సెక్టార్లలో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పర్యాటకం కూడా బాగా అభివృద్ధి చెందింది. మీడియా ప్రచారం పెరగడం వల్ల టైర్-2 నగరాల్లో క్రికెట్ కూడా అభివృద్ధి చెందింది. దీంతో దేశ వ్యాప్తంగా క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థపై ఐపీఎల్ ఓ సానుకూల ప్రభావాన్ని చూపెట్టడం స్ఫూర్తిగా ఉందని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. 60 రోజుల ఈవెంట్తో రూ. 1150 కోట్లు రావడం టోర్నీ విజయానికి నిదర్శనమన్నారు.
Tags