దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్
Published on Thu, 03/27/2014 - 00:00
న్యూఢిల్లీ: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఆర్.శ్రీధర్ ఐపీఎల్-7లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్కు ఫీల్డింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్గా హైదరాబాద్ జట్టుకు 12 ఏళ్లపాటు సేవలందించిన శ్రీధర్ 2001లో కోచ్గా కెరీర్ ప్రారంభించాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్లో భారత యువ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించాడు. కింగ్స్ ఎలెవన్ జట్టుకు పంజాబ్ ఫ్రాంచైజీ తనను ఫీల్డింగ్ కోచ్గా నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని 43 ఏళ్ల శ్రీధర్ అన్నాడు.
యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉన్న పంజాబ్ జట్టును ఐపీఎల్-7లో విజయపథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. శ్రీధర్ నియామకం పట్ల పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ సంతోషం వ్యక్తం చేశాడు.
#
Tags