అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
ఆర్సీబీ లక్ష్యం 174
Published on Sat, 04/13/2019 - 21:55
మొహాలి: ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్ క్రిస్ గేల్(99 నాటౌట్; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కడవరకూ క్రీజ్లో ఉండటంతో కింగ్స్ పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్-క్రిస్ గేల్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 66 పరుగులు జోడించిన తర్వాత రాహుల్(18) ఔటయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న రాహుల్ను చహల్ పెవిలియన్కు పంపాడు. అయితే మయాంక్ అగర్వాల్(15),సర్ఫరాజ్ ఖాన్(15)లు నిరాశపరిచారు. కాగా, గేల్ ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరును చక్కదిద్దాడు. దాంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చహల్ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్, మొయిన్ అలీలు తలో వికెట్ తీశారు.
Tags