వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కశ్యప్ శుభారంభం
Published on Wed, 08/02/2017 - 00:17
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సిరిల్ వర్మ, సౌరభ్ వర్మ శుభారంభం చేయగా... రెండో సీడ్ అజయ్ జయరామ్ పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్ మ్యాచ్లో కశ్యప్ కేవలం 22 నిమిషాల్లో 21–5, 21–10తో రుంబాకా (ఇండోనేసియా)ను చిత్తుగా ఓడించాడు.
ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 21–14, 21–16తో రుస్తావితో (ఇండోనేసియా)పై, సౌరభ్ వర్మ 21–17, 21–15తో నాథన్ (ఆస్ట్రేలియా)పై, సిరిల్ వర్మ 21–13, 21–12తో రియాంతో సుబగ్జా (ఇండోనేసియా)పై గెలిచారు. అజయ్ జయరామ్ 19–21, 13–21తో చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు.
#
Tags