వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెసిడెన్షియల్స్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
Published on Thu, 12/19/2013 - 00:44
గచ్చిబౌలి, న్యూస్లైన్: ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బుధవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మొదలైన ఈ పోటీలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ.వాణి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.
విద్యార్థుల వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో లేని ఎన్నో అంశాలను ఆటల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ఫాస్ట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45 పాఠశాలలకు చెందిన 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లయ బట్టు తదితరులు పాల్గొన్నారు.
#
Tags