అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సైనా మళ్లీ నంబర్వన్
Published on Fri, 04/17/2015 - 01:22
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి వారం రోజుల పాటే ఆ ర్యాంక్లో కొనసాగింది. మలేసియా ఓపెన్ సెమీస్లో ఓడటంతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. మరోవైపు పి.వి.సింధు మూడు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ నాలుగో ర్యాంక్ను నిలబెట్టుకోగా, పారుపల్లి కశ్యప్ 14, హెచ్.ఎస్.ప్రణయ్ 15వ ర్యాంక్లో ఉన్నారు.
#
Tags